నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్ష,మరో 10 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ లో 14 మందిపై కేసు నమోదు చేశారు. వారికి ఈరోజు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు ముగ్గురికి 2 రోజుల చొప్పున, ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. అలాగే 10 మందికి రూ.12 వేల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు