హుజూర్నగర్ మండల పరిధిలోని గుర్తింపు లేని క్లినిక్లు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలపై డీఎంహెచ్వో చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేని వట్టికూటి రాంబాబు నిర్వహిస్తున్న క్లినిక్ను సీజ్ చేశారు. అర్హత లేకుండా స్థాయికి మించిన వైద్యం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.