వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ ప్రధాన రహదారి నిర్మాణంతో శ్రీకారం చుట్టామని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.రూ.6 కోట్ల 50 లక్షలతో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా,ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఎస్పీ మహేష్ బి గితే,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు.వేములవాడ పట్టణ వాసులు, రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు, ప్రజలు 54 ఏండ్లుగా ఎదురు చూస్తున్న మూలవాగు నుంచి శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం దాకా రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు.