ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం ఏపీ సీపీడీసీఎల్ ఛైర్మన్ పుల్లారెడ్డి, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు స్మార్ట్ మీటర్ల పట్ల ఉన్న అపోహలను తొలగించాలని, ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్ ఆవశ్యకతను తెలియజేయాలని సూచించారు. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.