కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో జిల్లాలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల బోధన్లో ఎన్ఐఏ ఓ యువకుడిని అరెస్టు చేయడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి ఘటనలు సమాజాన్ని భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం పోలీసులపై ఒత్తిడి తెస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్ (BRS), ప్రస్తుతం కాంగ్రెస్ ఒకే మాదిరిగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నారు. హిందువులన్న, హిందూ పండుగలు అన్న చులకన భావంతో చూస్తున్నారని ఆరోపించారు.