తాడిపత్రి లోని అతి పురాతనమైన, పవిత్రమైన శ్రీ వేంకట రమణ స్వామికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను స్వామికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.