తమ సమస్యలు పరిష్కరించాలని 104 కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నస్పూర్ లోని మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఆరు నెలలుగా వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని, ఏజెన్సీ విధానం రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.