కడప జిల్లా జమ్మలమడుగు వైసిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి వైసిపి నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 9 వ తేదీన ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్నకి బాసటగా వైస్సార్సీపీ "అన్నదాత పోరు"కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో వైసీపీ నాయకులతో పలు అంశాలు చర్చించారు. అనంతరం నాయకులు,కార్యకర్తల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.