సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రిలో శనివారం వడ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. మూసీ కాలువపై ఉన్న బ్రిడ్జి కుంగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీలో డ్రైవర్తో పాటు హమాలీలు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థలో ఉన్న ఈ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు.