కావలి RDO కార్యాలయంలో శనివారం గిరిజనుల భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు హాజరై వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని RDO వంశీకృష్ణ తెలిపారు. ప్రతి నెల మొదటి శనివారం ఈ ప్రత్యేక గ్రీవెన్స్ డే జరుగుతుందని, దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది.