మంచిర్యాల పట్టణంలోని తిలక్ నగర్ లో గల దివ్యాంగుడు గోదారి మల్లేశ్కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు మహేశ్ వర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఆ స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల అనుమతితో నిర్మించుకున్న ఇంటిని కబ్జాదారులు కూల్చివేయడంతో మల్లేశ్ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.