కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 383 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 115 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 28, జీవీఎంసీకు సంబంధించి 94 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 146 వినతులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు శేషశైలజ, మధుసూధన్ రావు, చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయాలలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో అర్జీదారులు 110