తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆస్పత్రిలో శనివారం అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఏరియా అస్పత్రికి నిరుపేదలు వస్తుంటారని, మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అభివృద్ధి పనులు, నూతన భవన నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, శీలం కిరణ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.