కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ ఎమ్మెల్యేలు, మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ , జిల్లా అధికారులతో కామారెడ్డి కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అన్ని శాఖల అధికారులు కలిసిమెలిసి పనిచేసే ప్రజలకు మంచి సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గత 100 సంవత్సరాలుగా కురవనివర్షం ఈ సంవత్సరం కురవడం జరిగిందన్నారు.అధికారులందరూ ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు.