Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: వేలాల స్టాక్ యార్డ్ నుంచి ఇసుకను ఇసుక బజార్‌కు తరలించేందుకు అనుమతి మంజూరు: కలెక్టర్ కుమార్ దీపక్

Chennur, Mancherial | Aug 21, 2025
మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల స్టాక్ యార్డ్ లో ఉన్న ఇసుకను టి.జి.ఎం.డి.సి. సాండ్ బజార్ కు తరలించేందుకు అనుమతి మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లోని కలెక్టర్ కార్యాలం లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేలాల స్టాక్ యార్డులో ఉన్న 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలను టి.జి.ఎం.డి.సి. సాండ్ బజార్ కు కేటాయించడం కొరకు సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఇసుక బజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us