శంకర్పల్లిలోని ICFAI గంజాయి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తనిఖీల్లో 8 మంది ICFAI కాలేజీ విద్యార్థులతో సహా మహారాజుపేటకు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. టెస్టింగ్ కిట్లతో చేసిన పరీక్షల్లో అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇందులో అభినవ్సంగ్ వద్ద 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.