నల్గొండ జిల్లా, చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలతో ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి దేవాలయంలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బోనాల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా, ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.