పాల్వంచ మండలం కేపీ జగన్నాధపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ గుడి ప్రాంగణంలో కనకదుర్గ అమ్మవారు, శివాలయం ఈ రెండు ఆలయాలు మహా చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూసివేయబడింది. గ్రహణం దృష్ట్యా ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రజినీ కుమారి తెలిపారు. రేపు, ఉదయం 9 గంటల తర్వాత గ్రహణానంతర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, భక్తులకు దర్శనాలు తిరిగి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.