నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ పరిధిలోని సాలూర సమీపంలోని మంజీర వంతెనకు ఓ వ్యక్తి ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాత హై లెవెల్ వంతెనకు శనివారం మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.