శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో అనుమతులు లేకుండా ఇసుక దందాకు పాల్పడితేచట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హెచ్చరించారు. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఆయన నరసన్నపేటలో మాట్లాడారు. ఇటీవల మడపం గ్రామంలోని బుచ్చి పేట ర్యాంప్ వద్ద ఇసుక అక్రమ రవాణా చేసినట్లు మీడియాలో వచ్చిందని తెలిపారు దందాకు పాల్పడిన ఏ పార్టీ నాయకులు అయినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు...