పేద, బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జిల్లా కార్యదర్శి మాలాద్రి కొనియాడారు. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆదివారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరగనుందని తెలిపారు. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి సుధాకర్ రెడ్డి అని, ఆయన స్ఫూర్తితో మన ముందుకు సాగాలని మాల్యాద్రి సూచించారు.