కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి పట్టణంలో పర్యటించి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ బోర్డ్ వైకుంఠధామం యందు అత్యవసరంగా ఏర్పాటు చేయబడుతున్న రోడ్డు పనులను మరియు వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్ ను సందర్శించి వెంట ఉన్న ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ అధికారుల కు వెంటనే అత్యవసరంగా పునరుద్ధరణ పనులను చేపట్టవలసిందిగా ఆదేశించినారు అలాగే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించవలసిందిగా మరియు తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినారు.