రాజన్న సిరిసిల్ల జిల్లా,తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, బోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో ఉందా? లేదా అని ఆరా తీశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. సీఈసీ విద్యార్థులకు ఎకనామిక్స్ పాఠాలు బోధించి, పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యాలయం ఆవరణలో గడ్డి, ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని