సంగెం - కోడూరు మధ్యలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండలం సంగెంలో స్థానికులతో కలిసి వాగు వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణం కాకపోవడంతో గ్రామాల మధ్యన రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమై గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు.