కావలి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్సిపి క్యాంపు కార్యాలయంలో, స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద గల వైయస్సార్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది.