జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు వినాయక నిమజ్జనం జరిగే పాత కడప చెరువు, చెన్నూరు పి.ఎస్ పరిధిలోని ఇర్కాన్ సర్కిల్, శేషయ్య గారి పల్లి వద్ద ఉన్న కె.సి కెనాల్ బ్రిడ్జి, చెన్నూరు పెన్నా నది కొత్త బ్రిడ్జి, కొండపేట వంతెన వద్ద బుధవారం కడప డి.ఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జనం సంధర్బంగా వినాయక విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబందించిన డ్రైవర్లను సిద్దంగా ఉంచుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.