Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన DIEO రవికుమార్

Nizamabad South, Nizamabad | Sep 10, 2025
ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్ లోనే హాజరు తీసుకోవాలని DIEO తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ బుద్దిరాజ్ అధ్యక్షతన అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కాని విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, వారిని కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us