గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే చేబ్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైశ్యాలకు తరలించారు.