కామారెడ్డి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ దేవిప్రసాద్ బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు అని తెలిపారు.