కాకతీయ నగర్ కాలనీలోని కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ , నాన్నకు నగర్ కార్పొరేటర్ మహమ్మద్ నసిరుద్దీన్ నేతృత్వంలో అధికారులతో అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ట్రాఫిక్ శాఖల అధికారులు హాజరయ్యారు. కాలనీలో రోడ్లు, నీటి సరఫరా, స్ట్రీట్ లైట్లు, మురుగు వ్యవస్థ పై చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.