రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం నుంచి సింగారం, బండలింగంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో పూర్తిగా అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నిత్యం ఈ రహదారి గుండా వందలాది వాహనాలు ప్రయాణాలు సాగిస్తుంటాయి. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం స్పందించి నూతనంగా తారు రోడ్డును వేయాలని వాహనదారులు కోరుతున్నారు.