కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేరపూరిత చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సదాశివనగర్ లో ప్రభులింగం గోల్డ్ షాప్ కోసం వేసిన షెడ్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని, ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొంతమంది వ్యాపారం మార్వాడికి చెందినదని పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.