జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని, మతసామరస్యాన్ని భగ్నం చేసే రీతిలో ఫ్లెక్సీలు,ప్లకార్డులు రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.వీటి తయారీకి సంబంధించి ఆయన మార్గదర్శకాలు విడుదల చేశారు.వ్యక్తిగత విమర్శలు,విద్వేషపూరిత వ్యాఖ్యలు వాటిలో ఉండరాదన్నారు.ఇందుకు భిన్నంగా ఫ్లెక్సీలు,ప్లకార్డులు ఉంటే వేయించిన వారితో పాటు ముద్రణా సంస్థలపై చర్యలు ఉంటాయన్నారు.