చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలోని నగిరి వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గత కొన్ని రోజులుగా పూజలు అందుకున్న వినాయకుని ప్రతిమను బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. స్వామివారికి మహిళలు మంగళ హారతులు పట్టి వినాయక వెళ్లి రావయ్యా అంటూ వీడ్కోలు పలికారు. బళ్లారి డ్రమ్స్, యువకుల నృత్యాలు. కీలుబొమ్మ ఆటలతో కోలాహలంగా సాగిన నిమజ్జనం.