Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: ర్యాలీ గ్రామంలో ఆవుల మందపై పెద్దపులి దాడి, అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు

Mancherial, Mancherial | Aug 23, 2025
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలోనీ జొన్నలరాశి సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆవు మృతి చెందింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ర్యాలీ గ్రామపంచాయతీ పరిధిలోని జొన్నల రాశి సమీపంలో పశువుల మంద వద్ద అరికెల రాజు అనే పశువుల కాపారి మందతో పాటు రాత్రి అక్కడ నిద్రిస్తున్నాడు శనివారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు పెద్దపులి వచ్చి మందలో నుంచి ఆవును తీసుకువెళ్లి ఆవుపై దాడి చేసిందని రాజు తెలిపాడు
Read More News
T & CPrivacy PolicyContact Us