అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని సేవాగడ్ లో మాత జగదాంబ అమ్మవారు దుర్గా దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తొమ్మిదవ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకుడు మారుతి ప్రసాద్ మంగళవారం అమ్మవారికి సుప్రభాత సేవ, ఆకుపూజ, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయంలో భక్తులు భజనలు చేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు.