భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ను బుధవారం జారీ చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ విద్యుత్ ఆర్ అండ్ బి మత్స్యశాఖ అధికారులను సాయంత్రం 6 గంటలకు అప్రమత్తం చేశారు. ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎలాంటి ప్రమాద పరిస్థితులు ఉన్న వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు