71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహాగణపతిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఖైరతాబాద్ గణేశ్కు ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈ సారి నగరంలో దాదాపు 1.40లక్షల విగ్రహాలు ప్రతిష్ఠించారని, గణేశ్ మండపం నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందించామన్నారు.