రేపు అనగా 9వ తేదీన రైతులకు అండగా నర్సీపట్నంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ సోమవారం తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహానికి, అబీద్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్డిఓకు వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు.