నరసాపురంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చోరికి పాల్పడ్డారు. పట్టణంలోని మూడు ఎలక్ట్రికల్ షాపులు, ఒక ఎలక్ట్రానిక్ షాపు డోర్లు పగలగొట్టి సుమారు రెండు లక్షల రూపాయల నగదును దొంగిలించారు. అలాగే షాపుల్లోని సీసీ కెమెరాల డేటా రికార్డర్ను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసాపురం పట్టణ సీఐ యాదగిరి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.