ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అపనాచార్యులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 11 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 6 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్నందున ఆలయాన్ని మూసివేసినట్లు అపనాచార్యులు తెలిపారు. అనంతరం ఆలయం సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.