భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. మండలంలోని సంగోజిపేటలో ఇటీవల వర్షాలకు ధ్వంసమైన రోడ్లను మంగళవారం 3 గంటలకు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు వేగంగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఆనంద్, పిఆర్ ఏఈ, మాజీ ఎంపిటిసి జెట్టి హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.