నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జరిగిన వినాయక లడ్డు వేలం పాటలో రూ. 1,65,000 ధర పలికింది. ఈ లడ్డును అడీగోని నర్సింలు దక్కించుకున్నారు. అలాగే, కలశాన్ని బోయ రాములు రూ. 21 వేలకు సొంతం చేసుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, అఖిలపక్ష నాయకులు వారికి లడ్డును, కలశాన్ని అందజేశారు.