యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 50 పై తాహాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం పలువురు మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో అవకతవకలు జరిగాయని సర్వేనెంబర్ 50లో 700 ఎకరాలు ఉన్న భూమి 11 వందల ఎకరాలు ఎలా అయిందని అధికారులను ప్రశ్నించారు.