కొయ్యూరు మండలం హౌసింగ్ ఏఈగా పొత్తూరు ఉమామహేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కొయ్యూరు మండలంలోని మఠం భీమవరం గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను మండల ఇన్చార్జి హౌసింగ్ ఏఈగా నియమిస్తూ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ, మండలంలో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.