నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కడం మండలం కొత్తమద్దిపడగ గ్రామ నేతకాని సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పండుగ పూట వీధిలైట్లు ఏర్పాటు చేయమని విన్నవిస్తే, కారోబారితో ఫోటోలు తీయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.