ఓ మహిళ మరచిపోయిన హ్యాండ్ బ్యాగును ఆమెకు తిరిగి అందించిన సంఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది. ఆదివారం సాయంత్రం 5గంటలకు తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన కనకం రాజేందర్ ఆటోను ఓ మహిళ ఎక్కి గీతాభవన్ వద్ద దిగి వెళ్లిపొయింది. ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్. . మళ్లీ అదే ప్లేస్ కి వెళ్లి ఆ మహిళకు అప్పగించాడు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు ఉన్నట్లు తెలిసింది. నిజాయితీతో కూడిన ఈ చర్యకు రాజేందర్ ను పలువురు అభినందించారు.