ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో 17వ తేదీన నిర్వహించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ హాజరవుతున్నట్లు ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందన్నారు. ముస్లిం- హిందూ పోరాటంగా చిత్రీకరిస్తోందని చెప్పారు. స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్, వై.విక్రమ్తో కలిసి నున్నా మాట్లాడారు.