Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: గుత్తి పట్టణంలోని కోటలో వేడి వేడి పాలు నోటిలో పడి శ్వాస ఆడక చిన్నారి శర్విల్ రెడ్డి మృతి

Guntakal, Anantapur | Aug 20, 2025
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట ప్రాంతంలో వేడి వేడి పాలు నోటిలో ముక్కులో పడి శర్విల్ రెడ్డి అనే 15 నెలల చిన్నారి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి కోట లోని పోస్టాఫీసు ఎదుట నివాసం ఉండే ప్రతాప్ రెడ్డి, మేనక దంపతుల కుమారుడు శర్విల్ రెడ్డిపై బుధవారం వేడి పాలు నోటిలో, ముక్కులో పడ్డాయి. దీంతో చిన్నారి శర్విల్ రెడ్డిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు చికిత్స అందించేలోపు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us