Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేస్తుంది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యా చారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వెలుగు చూసింది.